JGL: పెగడపల్లి మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు రూ.12 లక్షల ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయని ఎంపీవో శశికుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా బకాయిలన్నీ చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.