కృష్ణా: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు మరోసారి నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మంగళవారం రిమాండ్ ముగిసింది. దీంతో ఇవాళ ఉదయం పోలీసులు ఆయనను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనకు రేపటి వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.