ADB: ఈనెల 9, 10 తేదీల్లో రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోటీల్లో జిల్లా నుంచి 20 టీమ్లు పాల్గొంటాయని చెప్పారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.