SKLM: విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేలా కుదుర్చుకున్న యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని వైసీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ట్రూ-అప్ ఛార్జీలు, ఎఫ్పిపిసిఎ వంటి వాటితో సామాన్యులు తీవ్రంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.