కోనసీమ: ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి అన్నదాన భవన నిర్మాణానికి మంగళవారం గాజువాక వాస్తవ్యులు నూక వెంకట గణేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి చరిత్ర గురించి వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు, సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.