BHPL: అన్నారం బ్యారేజ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మహాదేవపూర్ డివిజన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ పుణే ఆధ్వర్యంలో పరీక్షల కోసం మాత్రమే డీసిల్టేషన్ జరుగుతోందన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.