SRD: విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన బోధన అందించాలని సమగ్ర శిక్ష సీఎంఓ వెంకటేశం అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. ఆటపాటల ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన చేయాలని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.