MBNR: బాలానగర్ మండలం చిన్నరేవల్లి గ్రామంలో పార్వతీ పరమేశ్వర ఉత్సవాల సందర్భంగా కళ్యాణం అనంతరం, రెండో రోజు శకటోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళల తమపై ఉండాలని కోరి, తదనంతరం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.