WG: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు జనసైనికులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సభ్యత్వం కార్యకర్తల కుటుంబాలకు భరోసా, రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.