ELR: ప్రతి అర్జీని పరిష్కరించేలా కృషి చేస్తానని అన్ని విధాల నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు.