CTR: పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, పుంగనూరు తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు శనివారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రా రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రతి ఒక్కరి సమస్యను సవివరంగా తెలుసుకున్న చల్లా బాబు సంబంధిత అధికారులు ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.