WPLలో వరుసగా రెండు ఓటముల తర్వాత యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. యూపీ మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు సాధించింది. ఛేజింగ్లో ఢిల్లీ 144కు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (56) పోరాటం వృథా అయ్యింది. క్రాంతి గౌడ్ (4/25) ఆ జట్టును దెబ్బకొట్టింది. గ్రేస్ హ్యారిస్ (4/15) హ్యాట్రిక్ సాధించింది.