NLG: ఎన్నో ఏళ్ళుగా బీసీలు అగ్ర వర్ణాల జెండాలు అజెండాలు మోసేవారుగా ఉన్నారని బీసీల ఓటు బీసీలకు వేసి గెలిపించాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అద్యక్షులు టి.చిరంజీవులు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ రవిందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.