PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-11 గనిలో గతేడాది జరిగిన ప్రమాదంలో మరణించిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబ సభ్యులకు RG-1 GM లలిత్ కుమార్ చేతుల మీదుగా కాంట్రిబ్యూషన్ ₹ 10,57,128, మ్యాచింగ్ గ్రాంట్ ₹10 లక్షల చెక్కులను అందజేశారు. GM మాట్లాడుతూ గతేడాది ఘటన జరగడం బాధాకరమైన విషయమని, ఇదే క్రమంలో మృతుని కుమారునికి సంస్థలో డిపెండెంట్ సూటబుల్ ఉద్యోగం కల్పించామన్నారు.