NLG: నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శనివారం ఎంపీడీవో సంజీవ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. గత ఐదు నెలలుగా గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.