KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధించిన ధృవపత్రాలతోపాటు నంబర్ ప్లేట్ సరిగా ఉంచుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్ పాల్గొన్నారు.