AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో సునీల్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.