అనంతపురం నగరంలోని ఎస్సీ హాస్టల్లో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పరమేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు రూ. 3000కు పెంచాలని, సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.