VZM: JNTU–గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంలో మెరా యువ భారత్ సహకారంతో జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యువజన పార్లమెంట్–2026’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. యువతే దేశానికి ప్రధాన శక్తి అని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. నేటి యువతే రేపటి నాయకులన్నారు.