TPT: తిరుపతి అదనపు ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 195 ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని తెలిపారు. బృందాన్ని అభినందిస్తూ అధికారులకు రివార్డులు ప్రకటించారు.