W.G: నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణిస్తామనే నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా భావిస్తామని STU జిల్లా అధ్యక్షులు సాయి వర్మ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. హాజరు నమోదు కావడం ఆలస్యం అవ్వడం అనేది అనేక సాంకేతిక కారణాలు ఉంటున్నాయని అన్నారు. సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండడం, యాప్ సరిగా పని చేయకపోవడం అనేకసార్లు చూస్తూ ఉన్నాం, దీనికి టీచర్లల్ని బాధ్యులుగా చేయడం తగదన్నారు.