కృష్ణా: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు ఈ నెల 30వ తేదీ నుంచి మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రారంభం కానున్నాయని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దేహదారుఢ్య పరీక్షలు ప్రక్రియ మొత్తం ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు.