GDL: అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను బుధవారం ఏపీ కమ్యూనికేషన్ డీఐజీ లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ ఆలయ మర్యాదలతో వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం, జోగులాంబ అమ్మవారికి కుంకుమ అర్చనలు నిర్వహించారు.