KMM: వైరాలో బుధవారం ఫైబర్ సేవలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ ఫైబర్ సేవలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఫైబర్ సేవలను వైరా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు వెంకట నర్సిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ పాల్గొన్నారు.