HYD: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియోను మహేశ్ గౌడ్ విడుదల చేశారు. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశమన్నారు. మానవాళిని సత్య పథం వైపు నడిపించేలా క్రీస్తు మార్గం నిర్దేశమని అభివర్ణించారు.