SDPT: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికీ 16వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ (సెలవు దినం)రోజున కూడా జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాల మహిళా ఉద్యోగులు సమ్మెలో కూర్చున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను ప్రభుత్వం విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.