NGKL: గ్రామాలు ముంపునకు గురికావద్దని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన దీక్షలు సోమవారంతో 91వ రోజుకు చేరాయి. అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.