కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం మాలోత్ సంగ్యనాయక్ తండాలోని తుల్జా భవాని, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని మార్చి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ, హోమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. కావున భక్తులు భారీగా తరలి రావాలని కోరారు.