WGL: నగరంలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నగర ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను అదనపు కమిషనర్ స్వీకరిస్తున్నారు. విభిన్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరై ప్రజల వినతులను పరిశీలిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.