KRNL: పెద్దకడబూరులో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమై సుమారు రూ. 50,000 మేర నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోటేకల్లు రాజన్న రైతు ZPHS పాఠశాల సమీపంలో తన వృషభాల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఏఎస్ఐ శివరాములు పోలీసు సిబ్బందితో ఇతర గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు.