TG: ఇరాన్పై జరుగుతున్న దాడులను MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘ఖమేనీని హత్య చేయడం అమానుషం. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే. యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలి. ఇందులో భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగి సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంది’ అని అన్నారు.