ATP: నార్పల మండలం జంగం రెడ్డి పల్లె గ్రామ సమీపంలో ఆదివారం నాటు సారా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై సాగర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించమన్నారు. అందులో భాగంగా 300 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.