W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని 216 జాతీయ రహదారికి సమీపంలో ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ సమయం అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుందని, భక్తులు అవగాహనతో సహకరించాలని కోరారు.