NDL: కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టడంతో గర్భాలయ శిఖరాగ్రం దర్శనమిస్తోంది. దాదాపు 8 నెలలుగా నీటిలో మునిగి ఉన్న ఈ ఆలయం, 837 అడుగుల నీటిమట్టానికి చేరితే పూర్తిగా బయటకు వస్తుందని అర్చకులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు మేర నీటిమట్టం తగ్గుతోంది.