మన్యం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు చేపట్టామని ఆమె తెలిపారు.