MBNR: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ద్వారబంధనం అమల్లో ఉంటుంది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులకు సాధారణ దర్శనం కల్పించనున్నారు.