NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4న జరిగే దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉత్సవాలను ప్రారంభించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసి, కరపత్రాలను ఎమ్మెల్యేతో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పాల్గొన్నారు.