WNP: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన చాకలి కులస్తులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ శనివారం విమర్శించారు. వెంటనే స్పందించి నిందితులపై రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.