కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయి దారులకు నోటీసులు జారీ చేసి, మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలో భాగంగా పలు డివిజన్లలో పర్యటించారు. రేకుర్తి, కాపువాడ, రాంనగర్, కోతి రాంపూర్, అల్గునూర్లలో ఆస్తి పన్నుల వసూళ్లను పరిశీలించారు.