KMM: గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 2వ తేదీన ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మధిర డిపో మేనేజర్ రామయ్య తెలిపారు. వైరా బస్టాండ్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. పెద్దలకు రూ. 60, పిల్లలకు రూ. 30, తెలంగాణ ఆధార్ కార్డు కలిగిన మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.