విశాఖ: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల్లో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, సినీ స్టార్స్ పాల్గొన్న పోటీల్లో ఎమ్మెల్యే ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయన్నారు.