MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 105 ఏళ్ల చరిత్ర కలిగిన కాంట్రాక్ట్ బస్తీ సమస్యల వలయంలో చిక్కుకుందని, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కోరారు. శనివారం 18వ వార్డు ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని కమిషనర్ను విన్నవించారు.