MNCL: సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి 28వ వార్డుకు చెందిన సింగరేణి కార్మికుడు ఎండి రఫీ(48) శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లో చదువుకుంటున్న కుమారుడి పేరేంట్ మీటింగ్ కోసం రఫీ తన భార్యతో కలిసి వెళ్లాడు. రఫీ తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్యకు గాయాలయ్యాయి.