VZM: గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బొబ్బిలి రామకృష్ణకు జాతీయ సేవా విజనరీ పురస్కారం వరించింది. ఈయన స్వస్థలం ఎస్ కోట. ఈ పురస్కారాన్ని రామకృష్ణకు విశాఖలో శనివారం జరిగిన ట్రావెల్ అండ్ ఫౌండేషన్ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రధానం చేశారు. పర్యావరణం, విద్య, ఆరోగ్యం, న్యాయ, యోగ విభాగాల్లో అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది.