KMM: మంత్రి తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ రఘుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఖాదర్ బాబా అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులకు నేతలు ఫిర్యాదు చేశారు. భూదాన్ భూముల విషయంలో జర్నలిస్టు రఘు సీనియర్ మంత్రి తుమ్మలపై అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.