MNCL: మందమర్రి మండలం సారంగపల్లి సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మలుపు వద్ద అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.