KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివాస స్థల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. బాధితులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని సూచించారు.