VSP: విశాఖ నగర ప్రజలు తాగునీటిని వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. నగరంలోని 98 వార్డులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని, కలుషిత నీరు ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కాలువల గుండా వెళ్లే 448 పైపులైన్ల మార్పు పనులు రూ. 4 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు.