BPT: అద్దంకి కార్యనిర్వాహక ఇంజినీరు ఆదేశాల మేరకు, సంతమాగులూరు ఉపవిభాగం పరిధిలోని కాలువలకు ‘వారబంధి’ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 2, 3 తేదీలలో రెండు రోజుల పాటు కాలువలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, రైతు సంఘాల సభ్యులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.