CTR: పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సైన్స్ మేళా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన తమ సైన్స్ ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే ఒక అద్భుతమైన వేదికే సైన్స్ మేళా అన్నారు.